15 బంతులు ఆడమన్నాడు

Apr 23, 2026 - 11:18
 0  2
15 బంతులు ఆడమన్నాడు

ముంబై: రోహిత్‌ శర్మ ఇచ్చిన సలహావల్లే గుజరాత్‌ టైటాన్స్‌పై తాను సెంచరీ చేయగలిగానని తిలక్‌ వర్మ వెల్లడించాడు. ఈసారి ఐపీఎల్‌లో స్థాయికి తగ్గ రీతిలో ఆడలేకపోయిన తిలక్‌..అహ్మదాబాద్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో అజేయ శతకం (45 బంతుల్లో 101)తో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణమేమిటో తిలక్‌ వివరిస్తూ ‘రోహిత్‌ భాయ్‌తో ప్రత్యేకంగా మాట్లాడా. మ్యాచ్‌ పరిస్థితులతో సంబంధం లేకుండా తొలి 15-20 బంతులు ఆడు. నీ సత్తా ఏమిటో నీకు తెలుస్తుందన్నాడు’ అని చెప్పుకొచ్చాడు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0